రెండు ఆపిల్ పళ్ల చెక్కులు తీసి మిక్సీలో వేసి టేబుల్ స్పూన్ తేనెతో పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరవాత చన్నీటితో కడిగేయాలి.
టొమాటో గుజ్జులో కొద్దిగా తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత కడిగేయాలి.
రెండు టీ స్పూన్ల ముల్తానా మట్టిలో రెండు టీ స్పూన్ల చల్లని రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. బ్రష్తో ముఖానికి, కళ్ల చుట్టూ అప్లై చేసి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి.
రెండు టేబుల్ స్పూన్ల ఓట్మిల్ పొడిలో కోడిగుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. క్రమం తప్పకుండా ఈ ప్యాక్స్ వాడుతోంటే జిడ్డు తగ్గి చర్మం నిగారిస్తుంది.